నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ వ్రాసిన భారతానికి, చాలామంది కవులు తమ ఆలోచనలని చొప్పించి కల్పన చేశారు. వాటిని విడగొడుతూ “ఏవి కల్పనలు? ఏది కవిత్రయం యొక్క ఒరిజినల్?” అంటూ ఒక మంచి పుస్తకం ఈ మధ్య రిలీజయింది.
“ఉరిద్రెవ్వ గొరికి యిప్పుడు…” అంటూ ముంగిస, గుడ్లగూబల బారినుంచి తనని తాను కాపాడుకోవటానికి ఒక తెలివైన ఎలుక పిల్లితో ఏ రకంగా స్నేహం చేసిందనేది మహాభారతంలో తిక్కన ఏ విధంగా వర్ణించాడు? దాన్ని తరువాత వచ్చిన కవులు ఏ విధంగా “మరింత గొప్పగా” చిత్రీకరించారు? అని ఈ రచయిత తన పుస్తకంలో వివరించారు.
శత్రువు శత్రువుతో ఎటువంటి పరిస్థితులలో స్నేహం చేయాలన్న విషయమై పిల్లికీ ఎలుకకీ జరిగిన సంభాషణ ఇంతవరకూ నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకంలోనూ చదవలేదు.
ఆచార్య ఎం. జయదేవ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ తెలుగు హెడ్. మహాభారతం నుంచి దాదాపు 50 అద్భుతమైన కథలు సేకరించి పుస్తకంగా రూపొందించారు. ప్రతీ పేజీలోనూ ఈ రచయిత పడిన కష్టం తెలుస్తుంది. పిల్లలకి పది వారాలు ఈ కథలు చెప్పొచ్చు.
-ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాథ్.
Mahabharatamlo Jaanapada Kathamsha Kathalu - మహాభారతంలో జానపద కథాంశ కథలు
రచన: ఆచార్య ఎం.జయదేవ్
పేజీలు : 250
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర: 150 రూ.